ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విగతజీవిగా దీప్తిశ్రీ.. ఇంద్రపాలెంలో మృతదేహం లభ్యం

By

Published : Nov 25, 2019, 3:00 PM IST

Updated : Nov 25, 2019, 5:04 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో అపహరణకు గురైన దీప్తిశ్రీ.. మృతురాలిగా బయటపడింది. ఇంద్రపాలెం డ్రెయిన్‌లో చిన్నారి భౌతిక కాయాన్ని గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన దీప్తిశ్రీ కోసం పోలీసులు 3 రోజులుగా గాలించారు.

డ్రెయిన్‌లో చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం

డ్రెయిన్‌లో చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం

అనుమానమే నిజమైంది. అపహరణకు గురైన చిన్నారి దీప్తి శ్రీ.. విగతజీవిగా బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఇటీవల అపహరణకు గురైన దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. కాకినాడ ఇంద్రపాలెం డ్రెయిన్‌లో భౌతిక కాయాన్ని సిబ్బంది గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన దీప్తి శ్రీ కోసం పోలీసులు 3 రోజులుగా గాలించారు. ధర్మాడి సత్యం బృందం ఉప్పుటేరులో రెండు రోజులు వెతికింది.

Last Updated : Nov 25, 2019, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details