తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగుగుంటలో... దాదాపు 15 కాకులు, ఓ కొంగ మరణించాయి. అమలాపురం రూరల్ మండలం బండారులంకలోనూ ఐదు కాకులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అంతటా కరోనా భయం నెలకొన్న సమయంలో కాకుల్లోనూ కొవిడ్-19 వైరస్ ఉందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. అమరావతిలోని టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం చేరవేయటంతో.. పశువైద్యాధికారులు చనిపోయిన కాకికి పోస్టుమార్టం నిర్వహించారు. విషాహారం తినటం వల్లనే కాకులు మరణించాయని తెలిపినప్పటికీ... స్థానికుల్లో భయం తగ్గలేదు.
కాకుల మరణం.. స్థానికుల్లో భయం భయం! - కాకుల మరణంతో భయందోళనలో ప్రజలు న్యూస్
తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల కాకులు మరణించటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. కాకుల్లోనూ కొవిడ్-19 వైరస్ ఉందేమోనని స్థానికులు ఆందోళన చెందారు.

crows died in east godavari