గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో.... కోనసీమలోని లంక భూముల్లో గత పది రోజులుగా వరద ముంపులో ఉన్న పంటలు క్రమేపీ బయటపడుతున్నాయి. అవి కుళ్లిపోయి కనిపిస్తున్న తీరు ఆవేదన కలిగిస్తోంది. కోనసీమలోని 15 మండలాల్లో వరద తాకిడి ఎక్కువగా ఉంది. ఈ మండలాల్లో ఇప్పటివరకు 23వేల 750 ఎకరాల విస్తీర్ణంలో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.
తగ్గుతున్న గోదావరి వరద...బయట పడుతున్న పంటలు - కోనసీమ వార్తలు
గోదావరి ప్రవాహ వేగం తగ్గింది. కోనసీమలోని లంక భూముల్లో గత పది రోజులుగా వరద ముంపులో ఉన్న పంటలు క్రమేపీ బయటపడుతున్నాయి. వరద తాకిడికి పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిని..రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
![తగ్గుతున్న గోదావరి వరద...బయట పడుతున్న పంటలు crops damage in godavari floods in konaseema](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8534238-603-8534238-1598250719737.jpg)
వరదకు కుళ్లిపోయిన పంట
లంక భూముల్లో17 వేల 500 ఎకరాల విస్తీర్ణంలో అరటి, మునగ తదితర కూరగాయల పంటలు.... 6వేల 250 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటలు వరద నీటిలో మునిగి పోయాయి. ఈ కారణంగా రైతులు నష్టపోయారు.
ఇవీ చదవండి: కృష్ణా నది వరద ఉద్ధృతి.. సామాన్యులకు తప్పని తిప్ప
లు