ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

By

Published : Jun 2, 2020, 6:14 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా నమోదైన కేసులతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 273కు చేరింది.

covid cases increasing in east godavari dst daily
covid cases increasing in east godavari dst daily

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 29 కేసులు బయటపడ్డాయి. జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 273కి చేరింది. గొల్లలమామిడాడలో 8 మందికి కొత్తగా కరోనా వచ్చింది. ఇక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య 116కు పెరిగింది. రాజమహేంద్రవరం, మండపేట, రాజోలు తదితర ప్రాంతాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ముంబై నుంచి వచ్చినవారిని రాజోలు క్వారంటైన్‌లో ఉంచి 18 మందికి పరీక్షలు చేస్తే 9 పాజిటివ్‌ వచ్చింది. ఈరోజు రావులపాలెం, రాజోలు, అయినవిల్లి, జి.మామిడాడ, అనపర్తి తదితర ప్రాంతాల్లోనూ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

ABOUT THE AUTHOR

...view details