ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PULASA FISH: రేటు ఎంతైనా.. రుచి చూడాల్సిందే.. - Yanam Latest News

ఓ బామ్మ నాకు ఇష్టమైన పులస కూరతో భోజనాలు పెట్టాలంటే.. ఆస్తి మెుత్తం అమ్మినా సరిపోదంటుంది మనవడితో. హీరో మహేశ్​ బాబు నటించిన ఓ చిత్రంలోని సన్నివేశంలో మాటలు ఇవి. అరుదుగా దొరికే ఈ పులస చేపంటే మాంసాహార ప్రియులకు బహు ప్రీతి. సాధారణంగా వేలం ద్వారా విక్రయించే ఈ చేపను సొంతం చేసుకునేందుకు.. ఎంత ఖరీదైనా వెనకాడరు. తాజాగా గోదావరిలో దొరికిన ఈ మీనాన్ని తమ ఆత్మీయుల కోసం కొనుగోలు చేసి వండి వడ్డించాడో ఓ వ్యక్తి. దీనికి సంబంధించిన మరికొన్ని విశేషాలు.

Pulsa fish
పులస చేప

By

Published : Sep 3, 2021, 3:15 PM IST

'పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి' అంటారు ఉభయ గోదావరి జిల్లావాసులు. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం పులస చేప ప్రత్యేకత. ఈ మీనంతో చేసిన వంటకం బహు రుచిగా ఉంటుందంటారు మాంసాహార ప్రియులు. అందుకే కాస్త ఖరీదైనా ఏమాత్రం వెనకాడకుండా కొనుగోలు చేస్తారు. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం గౌతమి గోదావరి తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన ఒక పులస వేలం వేయగా రూ.25 వేలు రికార్డు ధర పలికింది. మరో వెయ్యి అదనంగా చెల్లించి ఓ మాంసాహార ప్రియుడు కొనుగోలు చేసి ఇంట్లో కూర వండించాడు.

పులస చేప

విదేశాల నుంచి వచ్చిన తన కుటుంబ సభ్యులకు ఎంతో రుచికరమైన ఈ పులస చేప పులుసు రుచి చూపించాలని.. ఖరీదైనా కొనుగోలు చేసినట్లు అతడు చెప్పాడు. బెండకాయలు, మరికొన్ని మసాల దినుసులతో కలిపి చేసే ఈ కూరను 24 గంటల తరువాత తింటేనే అద్భుతంగా ఉంటుందని తెలిపాడు.

ఇదీ చదవండీ..AP RAINS LIVE UPDATES : రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రోడ్లన్నీజలమయం

ABOUT THE AUTHOR

...view details