ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్ధులు, సిబ్బందికి కరోనా.. ప్రత్తిపాడు బాలికల బీసీ సంక్షేమ వసతిగృహం మూసివేత - తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో కరోనా కేసులు తాజా వార్తలు

కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో.. ప్రత్తిపాడు బాలికల బీసీ సంక్షేమ వసతి గృహంలో పలువురికి కొవిడ్ సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వసతి గృహన్ని 14 రోజుల పాటు ముసివేశారు.

Pratipada BC Welfare girls Hostel
మూతపడ్డ ప్రత్తిపాడు బాలికల బీసీ సంక్షేమ వసతిగృహం

By

Published : Apr 7, 2021, 3:34 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు బాలికల బీసీ సంక్షేమ వసతిగృహాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ముగ్గురు విద్యార్థినులకు.. ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు వసతి గృహం మూసేశారు. ఈ గృహంలో 59 మంది బాలికలు ఉంటున్నారు.

వీరితో కాంటాక్ట్ అయిన వ్యక్తులకు పరీక్షలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. సంబంధిత పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు చేపట్టారు. పక్కనే ఉన్న బాలుర వసతి గృహంలో 83 మంది విద్యార్థులు సైతం భయంతో ఇళ్లకు వెళ్లారు. 85 మందికి ఇద్దరే వసతి గృహంలో ఉన్నారని అక్కడి సిబ్బంది తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details