ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అవమానమో.. అనుమానమో.. కరోనా బాధితుడి బలవన్మరణం

By

Published : Aug 20, 2020, 8:09 AM IST

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలో జీఎస్ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు.. ఆసుపత్రిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

corona patient suicide
కరోనా బాధితుడు బలవన్మరణం

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం తుమ్మలోవకి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకటంతో.. బొమ్మూరు కొవిడ్ కేర్ సెంటర్​లో కొద్ది రోజులు ఉండి, ఆ తర్వాత హోం క్వారంటైన్​కు వెళ్లారు. మళ్లీ అనుమానంతో రాజానగరం కొవిడ్ ఆసుపత్రిలో చేరాడు. రాత్రి బాత్​రూమ్​కి అని చెప్పిన వెళ్లిన బాధితుడు.. అక్కడే ఉన్న కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గతంలో ఓ కరోనా రోగి మూడో అంతస్తు కిటికీ ద్వారా... దుప్పట్ల సాయంతో కిందకు వెళ్లి పరారయ్యాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై.. కిటికీలన్నీ పకడ్బందీగా మార్చటంతో బాధితుడు బాత్​రూమ్ కిటికీలో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆసుపత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. మృతుడు రాజమహేంద్రవరం న్యాయస్థానంలో అటెండర్​గా పనిచేసేవాడనీ.. పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి:వరద గోదావరి.. తగ్గుతోంది.. ఇంకా నీళ్లలో నానుతున్న గ్రామాలు

ABOUT THE AUTHOR

...view details