ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సంజీవని వాహనాల ద్వారా కరోనా నిర్ధరణ పరీక్షలు

By

Published : Jul 15, 2020, 11:45 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళనకర స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు... యు.కొత్తపల్లి మండలంలో సంజీవని వాహనాల ద్వారా కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

Corona diagnostic tests by Sanjeevani vehicles in East Godavari district
కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా బుధవారం 400 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. సంచార సంజీవని వాహనంపై మండలానికి చేరుకున్న వైద్యాధికారులు ఉప్పాడ, కొత్తపల్లి, మూలపేట, అమీనాబాద్ తదితర గ్రామాలకు చెందిన నాలుగు వందల మందికి పరీక్షలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details