ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 13, 2020, 2:54 PM IST

ETV Bharat / state

మడికిలో గర్భిణీ సహా ఇద్దరికి కరోనా

తూర్పుగోదావరి జిల్లా మడికిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. ఈ క్రమంలో గ్రామాన్ని అధికారులు సందర్శించి ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.

corona cases in madiki alamuru mandal east godavari district
మడికిలో కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికిలో ఇద్దరికి కరోనా సోకింది. గ్రామానికి చెందిన గర్భిణీకి, మరో యువకుడికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. వైరస్ నిర్ధరణ అయిన ప్రాంతాలను ఎస్​ఐ శివప్రసాద్, తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీవో ఝాన్సీ సందర్శించారు. ప్రత్యేక పారిశద్ధ్య చర్యలు చేపట్టారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. లేనిపక్షంలో ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details