ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 1, 2020, 7:38 PM IST

ETV Bharat / state

రంపచోడవరంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయ భవనం ప్రారంభం

రంపచోడవరంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం భవనాన్ని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అనంత బాబు ప్రారంభించారు.

east godavari district
రంపచోడవరంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయ భవనం ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం భవనాన్ని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అనంత బాబు ప్రారంభించారు. రైతులు పండించిన పంటలు దళారుల పాలు కాకుండా వ్యవసాయ మార్కెట్​లో గిట్టుబాటు ధరలకు విక్రయించుకోవచ్చు అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే వ్యవసాయ మార్కెట్ కమిటీలు పటిష్టం చేయడంతో పాటు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్న దొర, జిల్లా కార్యదర్శి రామాంజనేయులు పాల్గొన్నారు.

ఇది చదవండి: కాన్వాస్​పై కరోనా బొమ్మ... చిన్నారుల సృజన అదిరిందమ్మ..

ABOUT THE AUTHOR

...view details