ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ముంపు మండలాలపై కలెక్టర్ సమీక్ష

గోదావరి నది ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలవరం ముంపు మండలాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

By

Published : Jun 14, 2019, 6:06 PM IST

కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ సమీక్ష

పోలవరం ముంపు మండలాలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్​లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగినందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. గోదావరి నది ప్రవాహం ఈ ఏడాది భిన్నంగా ఉండే అవకాశమున్నందున నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.

ABOUT THE AUTHOR

...view details