ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 3, 2019, 2:01 PM IST

ETV Bharat / state

ఈనాడు కథనానికి సీఎం స్పందన.. చిన్నారి కళ్లకు భరోసా

కళ్లకు క్యాన్సర్‌ సోకి చూపు కోల్పోయిన చిన్నారి హేమ పరిస్థితిపై ఈనాడులో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. చిన్నారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

cm responds on   Hema with cancer of the eyes
కళ్లకు క్యాన్సర్‌ సోకిన చిన్నారి అనారోగ్యంపై సీఎం స్పందన

చిన్నారి హేమకు చికిత్స అందించాలని సీఎం జగన్​ ఆదేశం

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన చిన్నారి హేమ.. కళ్లకు క్యాన్సర్​ సోకి కంటి చూపును కోల్పోయింది. ఆమె దీన స్థితిపై 'కనులు లేవని... కన్నీళ్లకేం తెలుసు' అనే శీర్షికన ఈనాడు కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్​.. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి... వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలు

రాష్ట్రంలో ఇలాంటి నిరుపేదలను పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్​ తెలిపారు. క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించండని అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని...ఈలోగా అత్యవసర కేసులు ఉంటే.. వెంటనే చికిత్సలు అందించాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు !

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details