ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 19, 2021, 12:15 PM IST

Updated : Feb 19, 2021, 2:53 PM IST

ETV Bharat / state

అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం జగన్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి నూతన రథాన్ని ప్రారంభించారు.

antharvedi ratham inaguration
అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో కొలువైన లక్ష్మీనరసింహస్వామిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు.. సీఎంకు పూర్ణకుంభంతో సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్​.. స్వామివారి నూతన రథాన్ని ప్రారంభించారు.

గత ఏడాది సెప్టెంబర్ 5న అంతర్వేదిలో రథం దగ్ధమైంది. అనంతరం.. రూ.95 లక్షలతో 41 అడుగుల ఎత్తైన రథాన్ని ప్రభుత్వం చేయించింది. ఇవాళ ఆ నూతన రథాన్ని సీఎం ప్రారంభించారు. మరోవైపు.. ఈనెల 28 వరకు స్వామివారికి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు.

Last Updated : Feb 19, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details