ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 23, 2020, 4:40 PM IST

ETV Bharat / state

'కార్మిక చట్టాలు మార్చవద్దు'

రంపచోడవరంలో సీఐటీయూ నాయకులు.. ఆందోళన చేశారు. కార్మిక చట్టాలను మార్పు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. 12 గంటల పని విధానాన్ని తొలగించి... 8 గంటల విధానాన్ని అవలంబించాలన్నారు.

citu protest in rampachodavaram against workers act
రంపచోడవరంలో సమ్మె చేస్తున్న సీఐటీయూ నాయకులు

దేశంలో కార్మిక చట్టాలను మార్పు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ జిల్లా నాయకురాలు మట్ల వాణిశ్రీ అన్నారు. దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు.

లాక్​డౌన్​ సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్పు చేసిందన్నారు. 12 గంటల పని విధానాన్ని అమలు చేయడంతో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. 8 గంటల విధానాన్ని అవలంబించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details