ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

23, 476 లీటర్ల నాటు సారా ధ్వంసం.. 1687 కేసులు నమోదు - తూర్పుగోదావరి జిల్లా నాటుసారా పట్టివేత వార్తలు

జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది శనివారం దాడులు చేశారు. ఏకంగా 23, 476 లీటర్ల నాటుసారాను పెద్దాపురం పోలీస్​ స్టేషన్​ వద్దకు చేర్చి అనంతరం ధ్వంసం చేశారు.

cheap liquor caught and destroyed
భారీగా నాటుసారాను పట్టుకున్న జిల్లా పోలీసులు

By

Published : Oct 10, 2020, 3:25 PM IST

జిల్లాలో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. రంపచోడవరం, రామచంద్రాపురం, అమలాపురం, పెద్దాపురం, కాకినాడ, చింతూరు డివిజన్లలో 1687 కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్​, ఎన్ఫోర్స్​మెంట్​, పోలీస్​ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన తనిఖీల్లో... జిల్లాలో లభ్యమైన 23, 476 లీటర్ల నాటుసారాను పెద్దాపురం పోలీస్​ క్వార్టర్స్​కి తరలించారు.

అనంతరం వాటిని ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 58.69 లక్షల నగదును ఉంటుందని ఎస్పీ నయీమ్​ అస్మి తెలిపారు. ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నాటుసారా అరికట్టడంలో వివిధ శాఖల పనితీరు బాగుందని ఎస్పీ అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details