ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా వినాయక నిమజ్జనం..ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్‌ 2 నమూనా

రాజమహేంద్రవరంలో గణేష్ నిమజ్జనం ఉత్సాహంగా జరుగుతోంది. గోదావరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల పైనుంచి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.

By

Published : Sep 13, 2019, 7:50 AM IST

చంద్రయాన్‌ 2 నమూనా ప్రత్యేక వాహనంపై... గణేషుని ఊరేగింపు.

చంద్రయాన్‌2 నమూనా ప్రత్యేక వాహనంపై... గణేషుని ఊరేగింపు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో గణపతి నిమజ్జనాన్ని వినూత్నంగా ఏర్పాటు చేశారు. కుమారీ టాకీస్ రేవు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫంట్ల పైనుంచి విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేశారు. ఇందులో దేశభక్తిని చాటుతూ చంద్రయాన్‌-2 నమూనాతో యువకులు వాహనాన్ని తయారు చేశారు.ఈ ప్రత్యేక వాహనంపై గణేషుడిని ఊరేగిస్తూ నిమజ్జనం చేశారు.. ఈ కార్యక్రమం మహేంద్రసంఘం మేధరుల ఆధ్వర్యంలో జరిగింది. యువత తీన్‌మార్‌ డప్పులకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details