ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 5, 2021, 4:29 PM IST

ETV Bharat / state

ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా పని చేసుకునే హక్కు ఉంది: జేడీ లక్ష్మీనారాయణ

తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం వద్ద ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా స్థానిక యువకులు.. ఆయనను సత్కరించారు.

cbi ex director jd laxminarayana
cbi ex director jd laxminarayana

గురుపూజోత్సవ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ

గురుపూజోత్సవం సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయులు, విద్యాస్థంస్థల అధినేతలతో వర్చువల్​గా మాట్లాడారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రైవేటు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ... స్వేచ్ఛగా పని చేసుకునే హక్కు కల్పించిందని గుర్తు చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు ఆందోళనలకు దిగుతున్నారని.. దీనిపై ఆలోచించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.

ప్రకృతి వ్యవసాయం దిశగా...

గురుపూజోత్సవ వేడుక అనంతరం తన వ్యవసాయం క్షేత్రంలో డ్రోన్ ద్వారా మందు పిచికారి చేశారు లక్ష్మీనారాయణ. రైతులు ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని కోరారు. గత ఐదు నెలలుగా ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించానని.. ఫలితంగా రైతుల కష్టాలు తెలుసుకునే అవకాశం దొరికిందని చెప్పారు.

ఇదీ చదవండి:MP VIJAYA SAI: 'విశాఖ-విజయనగరం జంటనగరాలవుతాయి'

ABOUT THE AUTHOR

...view details