ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు స్టేషన్​లోని కారు ఇంజిన్ మాయం..పోలీసుల ప్రమేయం ఉందా!

ఓ కేసులో స్వాధీనపరుచుకున్న కారు.. పోలీస్ట్ స్టేషన్​లో ఉండగా ఇంజిన్ మాయం అవడంపై సామాజిక కార్యకర్తలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది పోలీసుల ప్రమేయంతోనే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

By

Published : Jun 3, 2021, 10:43 PM IST

car engine missing in east godavari
పోలీసు స్టేషన్ లోని కారు ఇంజిన్ మాయంపై విచారణ

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీసులు ఒక గంజాయి కేసులో స్వాధీనం చేసుకున్న కారు ఇంజిన్ మాయమైన ఘటనలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న కారు ఇంజిన్​ను అసలు దుండగులు ఎలా ఎత్తుకెళ్లారనే కోణంలో విచారణ జరుగుతోంది.

స్థానిక సామాజిక కార్యకర్తలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పోలీసులే దానిని అమ్మేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details