తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గోకవరం నుంచి పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు వెనుక చక్రాలు ఊడి పక్కకు వెళ్లిపోయాయి. దీంతో బస్సు అక్కడే నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు.. ప్రయాణికులను వేరే వాహనంలో గమ్యస్థానాలకు చేర్చారు.
ACCIDENT: ఊడిన బస్సు వెనుక చక్రాలు.. తప్పిన పెను ప్రమాదం - తూర్పు గోదావరి జిల్లా
గోకవరంలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయి.
![ACCIDENT: ఊడిన బస్సు వెనుక చక్రాలు.. తప్పిన పెను ప్రమాదం ఊడిన బస్సు వెనుక చక్రాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12967309-685-12967309-1630749027252.jpg)
ఊడిన బస్సు వెనుక చక్రాలు
ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. బస్సుల ఫిట్నెస్ విషయాల్లో తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాగా బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లు మంత్రికి ఆర్టీసీ ఎండీ వివరించారు.
ఇదీ చదవండి:ARREST: గంజాయి ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్