ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గాంధీజీ కలల సాకారం మోదీతోనే సాధ్యం' - తూర్పు గోదావరిలో భాజపా సంకల్ప యాత్ర

గాంధీజీ ఆశయ సాధన ప్రధాని మోదీతోనే సాధ్యమని భాజపా నాయకులు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్రను ఘనంగా నిర్వహించారు.

'గాంధీజీ కలల సాకారం మోదీతోనే సాధ్యం'

By

Published : Oct 20, 2019, 10:07 PM IST

'గాంధీజీ కలల సాకారం మోదీతోనే సాధ్యం'

గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య సాధన ప్రధాని మోదీతోనే వీలవుతుందని భాజపా నేతలు వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులోని ఎర్రవరం, ఏలేశ్వరం గ్రామాల్లో గాంధీజీ సంకల్ప యాత్ర చేశారు. భాజపా నాయకుడు గట్టెం వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రకు మహిళలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర భాజపా నాయకులు పరవస్తు సత్య గోపీనాధ్ దాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాలకొండయ్య పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details