కేంద్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం భాజపా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మానేపల్లి అయ్యాజీవేమ ప్రత్యేక పూజలు చేయించారు. ప్రధాని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఆయన అన్నారు. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాలనకు సంబంధించిన విజయాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రత్యేక పూజ అనంతరం ప్రజలకు పంచిపెట్టారు.
అమలాపురంలో ఇంటింటికీ భాజపా కరపత్రాల పంపిణీ - amalapuram bjp leader latest news
భాజపా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం భాజపా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రజలకు కరపత్రాలు పంచారు. అందులో ఏడాది పాలనకు సంబంధించిన విజయాలను వివరించారు.

కరపత్రాలు పంచుతున్న భాజపా నేత