ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 9, 2020, 12:57 PM IST

ETV Bharat / state

మత్స్యకారుల వలకు చిక్కిన 80 కిలోల టేకు చేప

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవులో మత్స్యకారుల వలకు భారీ టేకు చేప, రొయ్య చిక్కాయి. 80 కిలోల బరువు తూగిన టేకు చేపను నరసాపురానికి చెందిన వ్యాపారి రూ.8 వేలకు కొనుగోలు చేశారు.

big teak fish
మత్స్యకారుల వలకు చిక్కిన 80కిలోల టేకు చేప


తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది రేవులో మత్స్యకారుల వలకు భారీ టేకు చేప, రొయ్య చిక్కాయి. టేకు చేప 80 కిలోల బరువు ఉండగా.. రొయ్య జాతికి చెందిన లోబస్టర్ 800 గ్రాముల బరువు ఉంది. నరసాపురానికి చెందిన వ్యాపారి 80 కిలోల టేకు చేపను రూ.8 వేలకు, 800 గ్రాముల రొయ్యను 500 రూపాయలకు కొనుగోలు చేశారు. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మత్స్యకారుల వలకు చిక్కిన 80కిలోల టేకు చేప

ABOUT THE AUTHOR

...view details