ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్​ సక్రమంగా అందటం లేదని లబ్ధిదారుల ఆందోళన - కొత్తపల్లి తాజా సమాచారం

తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో రేషన్​ సక్రమంగా అందటం లేదని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత నెలలో రేషన్​ అందించలేదని 150 కుటుంబాల వారు వాపోయారు. ఈ నెల రేషన్​తో పాటు గత నెల రేషన్​ కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

concern
ఆందోళన

By

Published : Jun 1, 2021, 5:24 PM IST

రేషన్ సరుకులు తమకు సక్రమంగా అందించడం లేదని తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఏ.కొత్తపల్లిలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని 150 కుటుంబాలకు గత నెల రేషన్ అందించలేదని వారు వాపోయారు. దీనిపై ఎటువంటి సమాధానం చెప్పకుండా ఈ నెల సరుకులు ఇస్తున్నారని ఆరోపించారు. గత నెల రేషన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత నెలలో సర్వర్ సమస్య వల్ల కొన్ని కుటుంబాలకు రేషన్​ ఇవ్వలేకపోయామని మండల సరఫరా అధికారి రామారావు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details