ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 27, 2020, 6:59 PM IST

ETV Bharat / state

కరోనా వ్యాప్తి నియంత్రణకు అవగాహన కార్యక్రమం

వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉన్న ప్రజలకు వ్యక్తిగత శుభ్రత, స్వీయ నిర్బంధం, సామాజిక దూరం వంటి అంశాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.

Awareness program for control of corona outbreak in Konaseema
కోనసీమలో కరోనా వ్యాప్తి నియంత్రణకు అవగాహన కార్యక్రమం

కరోనా వ్యాప్తి నియంత్రణకు అవగాహన కార్యక్రమం

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కరోనా వైరస్​ వ్యాప్తిపై స్థానికులకు అధికారులు అవగాహన కల్పించారు. వ్యాపారుల వద్దకు వెళ్లి సామాజిక దూరం పాటించే విధంగా సర్కిల్ ఏర్పాటు చేయాలని సూచించారు. సర్కిల్​లో నిలబడి సరకులు కొనుగోలు చేయాలని కోరారు. కోనసీమ వ్యాప్తంగా పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిత్యం పన్నెండు వందల మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details