ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తండ్రి, కుమార్తెపై మారణాయుధాలతో దాడి!

By

Published : Jun 11, 2020, 2:51 PM IST

Updated : Jun 11, 2020, 3:33 PM IST

స్థల వివాదంలో రౌడీలు విరుచుకుపడ్డారు. మారణాయుధాలతో తండ్రి, కుమార్తెపై దాడిచేశారు. తన తండ్రిని కొట్టొద్దని అడ్డు వెళ్లిన కుమార్తె పై పైశాచికంగా ప్రవర్తించారు. మహిళ అని చూడకుండా ఆమె దుస్తులు చింపేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. బాధితుల రోదనలతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

attack on father
attack on father

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం.. చెయ్యేరులోని వడ్డిపేటలో దారుణం జరిగింది. యాళ్ళ అర్జున్​ రావు కుటుంబ సభ్యులపై.. గుత్తుల శ్రీనివాసరావు, ముడుదొడ్డి చిన్న శ్రీను ,గుత్తాల లోవరాజు, కూరాటి నాగరాజులు మారణాయుధాలతో దాడి చేశారు. అర్జున్​రావు తలపై, కాళ్ల మీద బలంగా కొట్టారు. తండ్రిని కొట్టొద్దని అడ్డు వెళ్లిన కుమార్తె నాగలక్ష్మి పైనా... కిరాతకంగా దాడిచేశారు. మహిళ అని చూడకుండా ఆమె దుస్తులు చింపివేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు.

మద్యం మత్తులో వీరు చేసిన హంగామాకు స్థానికులు భయపడిపోయారు. బాధితుల రోదనలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. రక్తం మడుగులో ఉన్న బాధితులను స్థానికులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

కొన్నేళ్లుగా యాళ్ళ అర్జున్​ రావుకు, దాడికిపాల్పడిన వారికి మధ్య రహదారి విషయంలో వివాదం జరుగుతోంది. పోలీసు స్టేషన్​లో వీటిపై కేసులు నమోదై ఉన్నాయి. అధికార పార్టీ నాయకుడు అండదండలతో .. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ముమ్మిడివరం సీఐ రాజశేఖర్ బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:ముగిసిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

Last Updated : Jun 11, 2020, 3:33 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details