తూర్పు గోదావరి జిల్లా రంపలో ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివాలయంలో.. మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయం 12వ శతాబ్దం నాటిదని స్థానికలు తెలిపారు. ఆలయంలో జరిగే ఉత్సవాల కోసం ప్రతి ఏటా ఏజెన్సీ ప్రాంతంతో పాటు.. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలు భక్తులు హాజరవుతారు.
ఈ ఆలయంలో ఉన్న రాతి సర్పం, శివలింగం, నంది విగ్రహాలను.. దేవతలే ఏర్పాటు చేశారని ప్రతీతి. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలతో పాటు.. సర్ప దోషం పోతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి.