తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం అలజడి రేపుతోంది. రెండు రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకుని వస్త్తోంది. అలలు తాకిడికి తీరానికి 25 మీటర్ల దూరంలో ఉన్న రెసిడెన్షియల్ భవనం పాక్షికంగా ధ్వంసం అయింది. రూ.70 లక్షలతో నిర్మించిన 9 గదుల రెసిడెన్షియల్ భవనం ప్రహరీ, రెండు దుకాణాలు కొట్టుకుపోయాయి. గత రెండు రోజులుగా సముద్రం ఉద్ధృతంగా ఉందని, ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
ANTARVEDI: ముందుకొస్తున్న సముద్రం.. భయాందోళనలో గ్రామస్థులు - antharvedhi latest news
ప్రశాంతంగా ఉండాల్సిన సాగర తీరం భీకరంగా మారుతోంది. అలల హోరుతో నిశ్చలంగా ఉండాల్సిన ఆ తీరంలో ఆలజడి రేగుతోంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సంద్రం ముందుకు చొచ్చుకురావడం ఆందోళన కలిగిస్తోంది.
![ANTARVEDI: ముందుకొస్తున్న సముద్రం.. భయాందోళనలో గ్రామస్థులు అంతర్వేదిలో సముద్రం అలజడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12732178-475-12732178-1628598447801.jpg)
అంతర్వేదిలో సముద్రం అలజడి