ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2021, 1:42 PM IST

ETV Bharat / state

అంతర్వేదిలో వైభవంగా మాఘ పౌర్ణమి వేడుక

మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంతర్వేది నరసింహస్వామి వారికి చక్రస్నానానికి అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సముద్రం చెంతకు స్వామి విగ్రహాలను తరలించారు.

Antarvedi Narasimhaswamy chakrasnanam
అంతర్వేది నరసింహస్వామి వారి చక్రస్నానం

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా చక్రస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. మాఘపౌర్ణమిని పురస్కరించుకుని ఈ వేడుక చేస్తారు. ఈ నేపథ్యంలో.. స్వామి వారి విగ్రహాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా సముద్రం చెంతకు చేర్చారు. సాగరతీరాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్వదినాన సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details