ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం - కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం

కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో... మరొకరి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని దేవీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటివరకూ లభ్యమైన 36 మృతదేహాలు లభ్యంకాగా ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సిఉంది. మరొకరి ఆచూకీ లభ్యంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో తొలిగించిన పోస్టుమార్టం, హెల్ప్​డెస్క్ స్థానంలో ఒక టెంట్ వేశారు.

కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం

By

Published : Sep 21, 2019, 11:46 PM IST

కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం
గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో....మరొకరి మృతదేహం లభ్యమైంది. కచ్చులూరు సమీపంలో తేలిన మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన అనంతరం దేవీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటివరకూ మొత్తం 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 15 మంది జాడ తెలియాల్సిఉంది. ప్రమాదం జరిగినేటికి ఏడు రోజులు కాగా...నేటి గాలింపు చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద పోస్టుమార్టం కోసం వేసిన టెంట్​లు, హెల్ప్‌డెస్క్‌ తీసివేశారు. మరో మృతదేహం లభ్యమైందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఆసుపత్రికి రావడం వలన తిరిగి ఆసుపత్రిలో ఓ టెంట్‌ వేశారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details