ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తీక మాసం...భక్తులతో కిటకిటలాడిన అన్నవరం

కార్తీక మాసంలోని మొదటి సోమవారం సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు చర్యలు తీసుకున్నారు.

By

Published : Nov 16, 2020, 3:59 PM IST

Annavaram Satyanarayana Swamy Temple
భక్తులతో కిటకిటలాడిన అన్నవరం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలోని మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి వ్రతాన్ని ఆచరించి, దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details