ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆన్‌లైన్‌ సేవల్లో సత్యదేవుని భక్తులు

By

Published : May 25, 2020, 2:49 PM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సేవలో భక్తులు పరోక్షంగా పాల్గొంటున్నారు. అనేక మంది భక్తులు ఆన్ లైన్ ద్వారా వ్రతానికి, నిత్యకళ్యాణానికి, చండీ హోమానికి రుసుము చెల్లిస్తున్నారు.

annavaram satyanarayana swamy seva's on online
ఆన్ లైన్ లో సత్యనారాయణ స్వామి సేవలు

కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ అమల్లో ఉండటం వల్ల అనేక మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా రుసుం చెల్లించి పరోక్షంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి పూజల్లో పాల్గొంటున్నారు. లాక్‌డౌన్‌తో స్వామి వారి దర్శనాలు నిలిపివేయగా.. స్వామివారికి నిత్యం జరిగే వ్రతాలు, కల్యాణం, ఇతర ఆర్జిత సేవల్లోనూ భక్తులు ఎవరూ పాల్గొనకుండా ఏకాంతంలో నిర్వహిస్తున్నారు. భక్తులు నేరుగా పాల్గొనే అవకాశం లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఆయా పూజల రుసుము చెల్లిస్తే వారి పేరుమీద పూజలు చేసి భక్తులు స్వామివారి ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు.

అనేక మంది భక్తులు దేవస్థానానికి ఆన్‌లైన్‌ ద్వారా వ్రతాలకు రూ.500, నిత్యకల్యాణానికి రూ.1,200, అమ్మవారి చండీహోమానికి రూ.558, ఆయుష్యహోమం రూ.2 వేలు రుసుం చెల్లించి పరోక్షంగా ఆయా సేవల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్‌ 13 నుంచి ఇలా పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్రతాలు 550, నిత్యకల్యాణం 92, చండీహోమం 78, ఆయుష్యహోమానికి 54 జరిగాయి. ఇలా సుమారు రూ.6.50 లక్షల ఆదాయం సమకూరింది.

ప్రస్తుత పరిస్థితుల్లో సత్యదేవుని దర్శనానికి భక్తులను ఎప్పటి నుంచి అనుమతిస్తారో స్పష్టత లేదు. భక్తులను అనుమతించినా.. కొద్ది నెలల పాటు పెద్దగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఆన్‌లైన్‌ సేవలపై దృష్టి సారించారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్ ఆంక్షల నడుమ 'ఈద్​'​ వేడుకలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details