ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 2, 2020, 8:18 AM IST

ETV Bharat / state

నూతన విద్యా విధానం నిలిపివేయాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన

నూతన విద్యా విధానం పట్ల రోడ్డున పడతాం అంటూ ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.

stop new education policy at mummidivaram
నూతన విద్యా విధానం నిలిపివేయాలని అంగన్వాడీ కార్యకర్తలు నిరసన

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రీ ప్రైమరీ పాఠశాలగా మార్చటం వల్ల అంగన్వాడీలు పూర్తిగా మూతపడతాయని..వాటితో ఐదు రకాల సేవలు ప్రజలకు అందకుండా పోతాయన్నారు. ప్రభుత్వం తక్షణం నూతన విద్యా విధానాన్ని నిలిపివేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఐసీడీఎస్ ప్రాజెక్ట్​కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'ఒప్పందానికి లోబడి ఉండేలా చూడండి.. లేదంటే 210 కోట్లు ఇప్పించండి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details