ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో వంతెన నిర్మాణ పనులు ప్రారంభం

By

Published : Feb 16, 2021, 3:59 PM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో సీలేరు నదిపై వంతెన నిర్మాణ పనులను మల్కన్​గిరి జిల్లా కలెక్టర్ విజయ్ ప్రారంభించారు. మార్చి 22న జరిగే మన్యం కొండ వనదేవత జాతరలో భాగంగా జరిగే అమ్మవారి మంగళస్నానం జరిపే ప్రదేశాన్ని సందర్శించారు.

ap odidha bridge
ఆంధ్రా - ఒడిశా సరిహద్దు వంతెన నిర్మాణ పనులు ప్రారంభం

రూ.10కోట్ల వ్యయంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో సీలేరు నదిపై నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులను మల్కన్​గిరి కలెక్టర్ విజయ ప్రారంభించారు. పోల్లురు గ్రామంలో వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. మార్చి 22న జరిగే మన్యం కొండ వనదేవత జాతరలో భాగంగా జరిగే అమ్మవారి మంగళస్నానం జరిపే ప్రదేశాన్ని సందర్శించారు.

జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్​కు చింతూరు ఐటీడీఏ అధికారులు స్వాగతం పలికారు. త్వరితగతిన ప్రాజెక్టును నిర్మించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో భోజన సదుపాయం, ప్రాథమిక వైద్య సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:ఆస్పత్రిలో పల్లా శ్రీనివాసరావును పరామర్శించిన చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details