తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు వసూలయితే... రూ.69లక్షలు మాత్రమే ఇచ్చినట్లు నల్లిమిల్లి ఆరోపించారు. అయితే వాటిని ఆధారాలతో రుజువు చేయాలని సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన విరాళాల ప్రతులను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ నెల 23న మధ్యాహ్నం 2:30 గంటలకు బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో తనపై వచ్చిన ఆరోపణలపై సత్యప్రమాణం చేస్తానని.. ప్రమాణానికి హాజరు కావాలని రామకృష్ణారెడ్డికిసవాల్ విసిరారు.
సవాల్కు ప్రతి సవాల్