మహాశివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడు, రంగాపురం గ్రామాల్లో వీరభద్రుని కొలిచారు. ఇందులో భాగంగా అలుగుల సంబరం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు త్రిశూల ఆకారంతో ఉన్న అలుగులను ముఖం, కంఠం భాగంలో గుచ్చుకుని ట్రాక్టర్లపై ఊరేగారు. శరభ శరభ అంటూ వీరభద్రుని స్మరణలతో ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
మహాశివరాత్రి సందర్భంగా వీరభద్రునికి అలుగుల సంబరం - Alugula Sambaram for Veerabhadraswamy news
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడు, రంగాపురంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. వీరభద్ర స్వామిని కొలుస్తూ.. భక్తులు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
![మహాశివరాత్రి సందర్భంగా వీరభద్రునికి అలుగుల సంబరం Alugula Sambaram for Veerabhadraswamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10976166-180-10976166-1615534739694.jpg)
వీరభద్రునికి అలుగుల సంబరం