ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయినవిల్లి: కరోనా పరీక్షల్లో ఎక్కువ మందికి నెగెటివ్ ఫలితాలు - పి గన్నవరం న్యూస్

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో... కొత్తగా వెలువడిన ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. చుట్టు పక్కల గ్రామాల్లో కరోనా పరీక్షలు చేయించుకున్న 138 మందికి నెగెటివ్, ఏడుగురికి పాజిటివ్ నిర్ధరణ అయినట్టు వైద్యులు తెలిపారు.

east godavari district
పి గన్నవరంలో అందరికీ నెగటివ్ ఫలితాలు

By

Published : Jun 28, 2020, 7:36 AM IST

Updated : Jun 28, 2020, 8:55 AM IST

తూర్పుగోదావరి పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ... చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ నెల 23న వివిధ గ్రామాలకు చెందిన 145 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయని అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి మంగాదేవి తెలిపారు. ఇందులో 138 మందికి నెగెటివ్ రాగా, ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఆమె వెల్లడించారు. ఈ మండలంలో ఇప్పటికే 42 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. వీరిలో కొందరు చికిత్స పొందుతున్నారు.

Last Updated : Jun 28, 2020, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details