ఆధార్ నమోదు, మార్పుచేర్పుల కేంద్రాల కుదింపుతో ప్రజల అవస్థలు
ఆధార్ నమోదు, మార్పుచేర్పుల కేంద్రాల కుదింపుతో రాజమహేంద్రవరంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజామునుంచే క్యూలైన్లో బారులు తీరి అవస్థలకు గురయ్యారు. వృద్ధులు, చిన్నారులు సైతం గంటల కొద్దీ నిలబడలేక నరకయాతన పడ్డారు. ఎండెక్కిన తర్వాత కూడా పని పూర్తి కాక.. ఆవేదనకు గురయ్యారు.