ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2020, 12:01 PM IST

ETV Bharat / state

జొన్నాడ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాలు ఢీ.... ఒకరు మృతి

జొన్నాడు జాతీయ రహదారిపై జరిగిన ద్విచక్రవాహనాల ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి శ్రీనివాస్​గా ఆలమూరు పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు.

accident in jonnada highway and a person died in east godavari district
రెండు బైక్​లు ఢీ... ఒకరు మృతి

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లంక శ్రీనివాస్​ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను రావులపాలెంలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి దుకాణం మూసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో జొన్నాడ రోడ్డు దాటుతుండగా... రాజమహేంద్రవరం నుంచి వస్తున్న మరో ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్​ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతాగాత్రున్ని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆలమూరు ఎస్సై శివప్రసాద్​ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details