త్రివేణి సంగమ తీరాన విశ్వేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ - statue of Lord Shiva was unveiled in confluence of the Uttaravahini Triveni
తూర్పు గోదావరి జిల్లాలోని ఉత్తరవాహిని త్రివేణి సంగమం ఒడ్డున.. పరమశివుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ ఆవిష్కరించారు.

త్రివేణి సంగమ తీరాన విశ్వేశ్వరుని విగ్రహా ఆవిష్కరణ
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తరవాహిని త్రివేణి సంగమం, గోదావరి తీరాన విశ్వేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్.. విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.