ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DEAD: జొన్నాడ జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి - east godavari district news

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

DEAD
జొన్నాడ జాతీయ రహదారిపై ప్రమాదం

By

Published : Jul 2, 2021, 12:18 AM IST


తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. జొన్నాడ గ్రామానికి చెందిన పాములు సత్తయ్య అనే రైతు పొలం నుంచి సైకిల్​పై ఇంటికి తిరిగి వెళుతూ.. జాతీయ రహదారి దాటుతుండగా ఈ ఘటన జరిగింది. రాజమహేంద్రవరం వైపు నుంచి రావులపాలెం వైపు వస్తున్న ఓ వ్యాన్ ఢీ కొనడంతో సత్తెయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి.

హైవేపై గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ సిబ్బంది బాధితుడిని వెంటనే అంబులెన్స్ సాయంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details