తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం రాజుల ఏనుగుపల్లిలో ఐదు పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్రమత్తమైన అధికారులు ఈ నెల 18న 59 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పరీక్షలు నిర్వహించిన వారందరికీ నెగెటివ్ వచ్చిట్లు వైద్యాధికారి కే.సుబ్బరాజు వెల్లడించారు.
ఆ గ్రామంలో 59 మందికి కరోనా నెగెటివ్ - పి గన్నవరం నియోజకవర్గం తాజా కరోనా వార్తలు
పి.గన్నవరం నియోజకవర్గం రాజుల ఏనుగుపల్లిలో 59 మందికి ఈ నెల 18న కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పరీక్షలు చేసిన వారందరికీ నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు.

రాజుల ఏనుగుపల్లి గ్రామంలో చేసిన కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలన్నీ నెగెటివ్ వచ్చాయి