ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళపై అత్యాచారయత్నం.. చెట్టుకు కట్టేసి ముగ్గురికి దేహశుద్ధి!

తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని ఓ గ్రామంలో చిన్నారులతో నివసిస్తున్న ఓ మహిళపై నలుగురు యువకులు అత్యాచారనికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు యువకులను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.

By

Published : Jun 8, 2021, 10:11 AM IST

మహిళపై అత్యాచారయత్నం.. చెట్టుకు కట్టేసి ముగ్గురికి దేహశుద్ధి!
మహిళపై అత్యాచారయత్నం.. చెట్టుకు కట్టేసి ముగ్గురికి దేహశుద్ధి!

రాయవరం మండలంలోని ఓ గ్రామంలో మహిళ చిన్నారులతో కలిసి నివసిస్తోంది. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేయాలని అనుకున్నారు. నిన్న రాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. నలుగురూ అత్యాచారయత్నం చేశారు.

మహిళ కేకలు వేయడంతో అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు... అక్కడికక్కడే ముగ్గురు యువకులను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. వారికి దేహశుద్ధి చేశారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details