తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఉన్న శ్రీ అలివేలుమంగ శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి... 11 లక్షల విలువైన మకర తోరణాన్ని బహూకరించారు. రావులపాలేనికి చెందిన నల్లమిల్లి సాయినాథ్రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు వెంకటేశ్వరస్వామికి మకర తోరణాన్ని తయారు చేయించారు. మకర తోరణాన్ని ఆలయకమిటీ ఛైర్మన్ పడాల పెదవెంకటరెడ్డికి అందించగా.. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి అలంకరించారు.
రావులపాలెం వెంకటేశ్వర స్వామికి మకర తోరణం బహూకరణ - మకర తోరణం న్యూస్
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఉన్న శ్రీ అలివేలుమంగ శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి... ఓ భక్తుడు మకర తోరణాన్ని బహూకరించారు. ప్రత్యేక పూజల నిర్వహణ అనంతరం స్వామి వారికి మకరతోరణాన్ని అలంకరించారు.
రావులపాలెం వెంకటేశ్వర స్వామికి మకర తోరణం బహూకరణ