ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుత్తులవారిపేటలో 10 కుటుంబాలను బహిష్కరించిన గ్రామపెద్దలు - పది కుటుంబాల సాంఘిక బహిష్కరణ

తూర్పుగోదావరి జిల్లా కాజులూరు గుత్తులవారిపేటలో సాంఘిక బహిష్కరణ వెలుగులోకి వచ్చింది. పది కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వారికి ఓటు వేయలేదని బహిష్కరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

10 families
10 families

By

Published : Mar 3, 2021, 2:09 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం గుత్తులవారిపేటకు చెందిన గ్రామపెద్దలు.. పది కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వర్గానికి ఓటేయలేదంటూ ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బహిష్కరణపై గొల్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందారు. పైగా.. తమపైనే కేసులు పెడతామంటూ గొల్లపాలెం ఎస్‌ఐ బెదిరించారని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details