తూర్పు గోదావరి జిల్లాలో ఎస్పీ రవీంద్రనాథ్బాబు నేతృత్వంలో బృందం.. బుధవారం భారీగా గంజాయి తోటలను ధ్వంసం(10 acres of ganja plantation destroyed) చేసింది. ఒడిశా సరిహద్దుల్లోని చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ ఒడియా క్యాంపు సమీప అటవీ ప్రాంతంలో పది ఎకరాల్లో గంజాయి సాగు(cannabis plantations) చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఎస్పీతోపాటు ఎస్ఈబీ అదనపు ఎస్పీ రమాదేవి, ఎటపాక ఏఎస్పీ కృష్ణకాంత్, చింతూరు సీఐ యువకుమార్, మోతుగూడెం ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు, స్థానికులతో కలిసి 1.5 కిలోమీటర్లు అడవిలో నడిచివెళ్లారు. పది ఎకరాల్లో సాగైన సుమారు రూ.2.50 కోట్ల విలువైన మొక్కలను నరికి, తగలబెట్టారు(Cannabis plantation worth Rs 2.50 crore destroyed in east godavari district). గంజాయి తోటల నిర్మూలనకు స్థానికులు స్వచ్ఛందంగా కలిసి వచ్చారని ఎస్పీ అభినందించారు.