ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: చిత్తూరు జిల్లాలో జంతుప్రదర్శనశాల మూసివేత - చిత్తూరు జిల్లాలో జంతుప్రదర్శనశాల మూసివేత

కరోనా ప్రభావం పర్యాటక శాఖపైనా పడింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో తిరుపతి సమీపంలోని ఎస్వీ జంతు ప్రదర్శనశాలను మూసివేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

zoo closed in chittore district
చిత్తూరు జిల్లాలో జంతుప్రదర్శనశాల మూసివేత

By

Published : Mar 20, 2020, 7:13 PM IST

చిత్తూరు జిల్లాలో జంతుప్రదర్శనశాల మూసివేత

కరోనా వైరస్ కారణంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు, జంతు ప్రదర్శనశాలలు మూతపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలు, విద్యాసంస్థలు, కళాశాలలు, థియేటర్లు, బార్లు, పార్కులు అన్నింటిని మూసివేశారు. జూపార్కు సందర్శన కోసం వచ్చామని... ముందస్తు సమాచారం ఇవ్వకుండా పార్కు మూసేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details