చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 25వ డివిజన్ వార్డు సచివాలయంలో.. వైకాపా నేత వీరంగం సృష్టించాడు. మహిళా కార్యదర్శిని దుర్భాషలాడుతూ.... మరో ఇద్దరిపై దాడికి దిగాడు. ఓ వాలంటీర్ తొలగింపు విషయమై.. సంబంధిత వార్డు వైకాపా ఇంఛార్జి ప్రకాశ్ రెడ్డి.. మహిళా కార్యదర్శిని దూషించాడు. అక్కడే ఉన్న వార్డు సంక్షేమ అభవృద్ధి కార్యదర్శి, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి.. ప్రకాశ్ రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిపై ప్రకాశ్ రెడ్డి చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సచివాలయ సిబ్బందిపై వైకాపా నేత దాడి - వైకాపా ఇంఛార్జ్ ప్రకాష్ రెడ్డి ఇద్దరు ప్రభుత్వ కార్యదర్శులపై దాడి వార్తలు
చిత్తూరులోని వార్డు సచివాలయంలో అధికారులపై వైకాపా నేత దాడికి దిగాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![సచివాలయ సిబ్బందిపై వైకాపా నేత దాడి ysrcp leader attack on government employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6217153-414-6217153-1582775806200.jpg)
చిత్తూరులో ప్రభుత్వ ఉద్యోగులపై దాడి