నలభై సంవత్సరాల క్రితం రమేష్తో పాటు మరో ఎనిమిది మంది కలిసి గ్రామానికి రహదారి నిర్మించడానికి తమ పట్టా భూములు కేటాయించారు. ఎన్నికల్లో ఓడిపోవటంతో తన భూమిలో రహదారి వద్దంటూ రమేష్ తవ్వేశారని వాపోతున్న గ్రామస్థులు.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతోందని పేర్కొన్నారు.
గెలిపించలేదని కోపం.. రోడ్డును తవ్వేసి ప్రతాపం - యర్రంపల్లెలో రోడ్డు తొలగించిన వైకాపా అభ్యర్ధి తాజా వార్తలు
వార్డు మెంబర్గా తనను గెలిపించలేదన్న ఆగ్రహంతో.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం యర్రంపల్లెలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి రమేష్ ఆ గ్రామానికి వెళ్లే రహదారిని తవ్వేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గెలిపించలేదని అక్కసుతో రోడ్డు తవ్వేశాడు
ఇవీ చూడండి...