చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్ పేట దళిత వాడ గ్రామ మహిళా వాలంటీర్పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో అందరికీ ట్యాంకర్తో నీటిని అందించి తమ ఇంటికి మాత్రమే నీటిని సరఫరా చేయటం లేదు ఎందుకని ప్రశ్నించినందుకు... దాడికి పాల్పడ్డారని పోలీసులకు వాలంటీర్ ఫిర్యాదు చేశారు. కర్రలు, రాళ్లతో ఇంటిపై దాడికి దిగి సామగ్రి ధ్వంసం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకూ తన కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలయ్యాయని... న్యాయం చేయాలని కోరారు.
మహిళా గ్రామ వాలంటీర్పై వైకాపా నేతల దాడి - చిత్తూరులో మహిళా వాలంటీర్పై వైసీపీ నేతల దాడి న్యూస్
చిత్తూరు జిల్లాలో ఓ మహిళా గ్రామ వాలంటీర్పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తమ ఇంటికీ ఎందుకు నీరు సరఫరా చేయడం లేదని ప్రశ్నించినందుకు దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.
![మహిళా గ్రామ వాలంటీర్పై వైకాపా నేతల దాడి ycp leaders attack on women village volunteer in chittoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7327281-502-7327281-1590313272920.jpg)
ycp leaders attack on women village volunteer in chittoor
TAGGED:
ysrcp leaders attack news