ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కల్యాణి డ్యాంకు పోటెత్తుతున్న వరదనీరు

By

Published : Dec 3, 2020, 6:50 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యామ్​కు వరద నీరు పోటెత్తుతోంది. శేషాచల అటవీ ప్రాంతం నుంచి వాగుల ద్వారా నీరు ఉద్ధృతంగా డ్యాంలోకి చేరుతోంది. మరో 5 అడుగుల నీరు చేరితే గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు.

kalyani dam
కల్యాణి డ్యాంకు పోటెత్తుతున్న వరదనీరు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కల్యాణి డ్యాంకు వరదనీరు పోటెత్తింది. ప్రస్తుత నీటిమట్టం 895 అడుగులు ఉంది. మరో 5 అడుగుల మేర నీరు చేరితే డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

నివర్, బురేవి తుపానుల ధాటికి శేషాచల అటవీ ప్రాంతం నుంచి వరద నీరు పోటెత్తోంది. ఇన్-ఫ్లో క్రమంగా పెరుగుతోంది. తిరుపతికి తెలుగుగంగ నీటి పంపింగ్ నిలిపిన అధికారులు కల్యాణి డ్యామ్ నీటిని ఎక్కువగా తిరుపతికి పంపింగ్ చేస్తున్నారు. డ్యామ్​కు ప్రమాదం జరగకుండా ఏ క్షణాన్నయినా గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసులు, మండల అధికారులు డ్యామ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు. స్వర్ణముఖి పరివాహక ప్రాంతాలకు పశువుల కాపరులు వెళ్లవద్దంటూ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details